హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికీ అభ్యర్థులను ప్రకటించడానికి గ్రాండ్ ఓల్డ్పార్టీ కాంగ్రెస్ (Congress) ఆపసోపాలు పడుతున్నది. నామినేషన్ల గడువు సమీపిస్తున్నప్పటికీ పోటీలు ఉండేదెవరని నిర్ణయించడానికి కష్టపడుతున్నది. షెడ్యూల్ వెలువడిన వారం తర్వాత గానీ సగం మంది అభ్యర్థులను కూడా తేల్చలేకపోయింది. అభ్యర్థుల ఎంపికకు నియమించిన కమిటీ పలువురి పేర్లను ఒడబోసి ఎట్టకేలకు ఓ లిస్ట్ను ఫైనల్ చేసింది. దానిని ఆమోదించిన పార్టీ అధిష్ఠానం 55 మందితో కూడిన తొలి జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది.
అందులో సగానికిపైగా పాతవారే ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారికీ మరోసారి అవకాశం లభించింది. అదేవిధంగా ఈ మధ్యే పార్టీ మారిన తండ్రీ కొడుకులకు కూడా అందులో చోటు కల్పించింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మరోసారి తమ సీట్లు దక్కించుకున్నారు. ఇక పెద్దలు జానారెడ్డి స్థానంలో.. నాగార్జునసాగర్ నుంచి ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి బరిలోకి దిగుతున్నాడు.
బెల్లంపల్లి (ఎస్సీ)- గడ్డం వినోద్
మంచిర్యాల- కే.ప్రేమ్సాగర్ రావు
నిర్మల్- కే. శ్రీహరి రావు
ఆర్మూర్- పీ. వినయ్ కుమార్ రెడ్డి
బాల్కొండ- ఎం. సునీల్ కుమార్
బోధన్- పీ. సుదర్శన్ రెడ్డి
జగిత్యాల- టీ. జీవన్ రెడ్డి
ధర్మపురి (ఎస్సీ)- ఏ. లక్షణ్ కుమార్
రామగుండం- ఎంఎస్ రాజ్ ఠాకూర్
మంథని- డీ. శ్రీధర్ బాబు
పెద్దపల్లి- సీహెచ్. విజయ రమణారావు
వేములవాడ- ఆది శ్రీనివాస్
మానకొండురు (ఎస్సీ)- డాక్టర్ కే. సత్యనారాయణ
మెదక్- మైనంపల్లి రోహిత్ రావు
అందోల్ (ఎస్సీ)- సీ. దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ (ఎస్సీ)- ఏ.చంద్రశేఖర్
సంగారెడ్డి- టీ. జయప్రకాశ్ రెడ్డి
గజ్వెల్- టీ. నర్సా రెడ్డి
మేడ్చల్- టీ. వజ్రేశ్ యాదవ్
మల్కాజిగిరి- మైనంపల్లి హనుమంతరావు
కుత్బుల్లాపూర్- కే. హనుమంత్ రెడ్డి
ఉప్పల్- ఎం. పరమేశ్వర్ రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ)- పీ. భీమ్ భరత్
పరిగి- టీ. రామ్ మోహన్ రావు
వికారాబాద్- జీ. ప్రసాద్ కుమార్
ముషీరాబాద్- అంజన్ కుమార్ యాదవ్
మలక్పేట్- షైక్ అక్బర్
సనత్నగర్- డాక్టర్ కోట నీలిమా
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
కార్వాన్- ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రి
గోషామహల్- మొగలి సునీత
చాంద్రాయనగుట్ట- బోయ నగేశ్ (నరేశ్)
యాకుత్పురా- కే. రవి రాజు
బహదూర్పురా- రాజేశ్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్- ఏ. సంతోశ్ కుమార్
కొడంగల్- రేవంత్ రెడ్డి
గద్వాల- సరితా తిరుపతయ్య
అలంపూర్ (ఎస్సీ)- ఎస్ఏ. సంపత్ కుమార్
నాగర్కర్నూల్- కే. రాజేశ్ రెడ్డి
అచ్చంపేట (ఎస్సీ)- సీ. వంశీ కృష్ణారెడ్డి
కల్వకుర్తి- కే. నారాయణరెడ్డి
షాద్నగర్- కే.శంకరయ్య
కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్- కే.జయవీర్
హుజూర్నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
నల్లగొండ- కే.వెంకట్ రెడ్డి
నకిరేకల్ (ఎస్సీ)- వేముల వీరేశం
అలేరు- బీర్ల ఐలయ్య
స్టేషన్ ఘన్పూర్- ఎస్. ఇందిర
నర్సంపేట- డీ. మాధవ రెడ్డి
భూపాలపల్లి- జీ. సత్యనారాయణ రావు
ములుగు (ఎస్టీ)- సీతక్క
మధిర (ఎస్సీ)- భట్టి విక్రమార్క
భద్రాచలం (ఎస్టీ)- పొదెం వీరయ్య