హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇటీవల ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధే కారణమని ఆమెపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీకి నోటీసులు పంపి, విచారణకు పిలువాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందడమే కాకుండా.. యువత జీవించే, జీవనోపాధి పొందే హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ వివరాలు, నిరుద్యోగ భృతి చెల్లింపుల స్థితి, పారదర్శకంగా వార్షిక జాబ్ క్యాలెండర్ అమలు, మరణించిన యువతకు ఆర్థికసాయం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డైరీ నంబర్ 4042/ఎన్/ 2026ను కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించింది. యువ సంఘర్ష్ సభ పేరిట సరూర్నగర్ స్టేడియంలో డిక్లరేషన్ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆలిండియా ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంకగాంధీ 2023 మే 8న నిర్వహించిన ఈ సభకు హాజరయ్యి, డిక్లరేషన్ను విడుదల చేశారు.
హామీనిచ్చి.. అమలుచేయనివి