హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వర్షాల వల్ల వచ్చే వరదలతో ప్రజలు అల్లాడిపోతుం డగా, కాంగ్రెస్ బురద రాజకీయాలకు దిగిందని రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పిలుపునివ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే నీచ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని మండిపడ్డారు. వరదలతో అవస్థలు పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఆందోళనలకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు.