సారంగాపూర్, జనవరి 20: ఏడా ది లోపు రైతుల రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉం దని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. గ్రామా ల్లో నిధుల కొరత ఉన్నా సర్పంచులు అభివృద్ధిలో ముందుకు పోతున్నారని, బిల్లులు రాలేదని ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ పథకాలకు కొనసాగింపుగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఆమోదం పొంది సర్పంచులకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం కూలీలకు పని భద్రత కల్పించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. సర్పంచులకు రావాల్సిన బిల్లులను మార్చి నెల వరకు ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు.