జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం చౌడూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి గులాబీ కoడువాలు మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అందరూ కలిసి కట్టుగా అభివృద్ధి కార్యక్రమ్లా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పార్టీలో చేరిన వారికి సరైన గౌరవం దక్కే విధంగా చూస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నామని వారు తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీపీ బస్వ మల్లేశం, సోమనర్సయ్య దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, ఇనుముల శ్రీనివాస్, ప్రకాష్, ఉపేందర్, గడ్డం నరేష్, శ్రీనివాస్, యాకయ్య, ఏడేల్లి సోమన్న, చంద్రశేఖర్, మంద సాగర్, అజయ్ గంగారపు అరవింద్, తరుణ్, పెడవెల్లి బన్నీ, తదితరులు తదితరులు ఉన్నారు.