మహబూబ్నగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ మూకలు దాడికి తెగబడిన ఘటన నారాయణపేట జిల్లాలో కోస్గి లో చోటుచేసుకున్నది. సీఎం ఇలాకాలోని కోస్గిలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. అర్ధరాత్రి సమయంలో 2వ వార్డు అభ్యర్థి అలవేణి రాజశేఖర్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. గెలిచిన ఆనందంలో పైశాచికత్వంగా ప్రవర్తించారు.
విచక్షణ లేకుండా.. మహిళ అని కూడా చూడకుండా.. ఆమెతోపాటు తన భర్తపై దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కిడ్నాప్లు, బెదిరింపులు సర్వసాధారణంగా మారాయని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్తున్నారు.