కీసర, మార్చి 30 : టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి జిల్లాలో ఏ పార్టీకి లేదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుమారు 200 మంది తన అనుచరవర్గంతో బుధవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ పార్టీ నెంబర్వన్గా ఉందని, ఈ పార్టీని ఢీకోనే శక్తి మరే పార్టీకి లేదన్నారు. నేడు గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని, గతంలో గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి జరుగలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే గ్రామాల్లో అభివృద్ధి పరంగా మరింత ప్రగతి సాధిస్తున్నామన్నారు.
ఎక్కడ చూసిన అభివృద్ధి గురించే చర్చ జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామాల్లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కందాడి వెంకట్రెడ్డి, కందాడి శ్రీనివాస్రెడ్డి, రాజిరెడ్డి, వంగేటి పర్వత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.