బెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో నాయకుల కొట్లాట
బెల్లంపల్లి టౌన్, ఆగస్టు 25 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు కొట్లాటకు దిగారు. దళిత, గిరిజన దండోరా సన్నాహక సమావేశం ఇందుకు వేదికైంది. దండోరా కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జిగా జనక్ప్రసాద్ను నియమించారు. సన్నాహక సభను మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటుచేశారు. కాగా, సమావేశాన్ని ఉదయం 11 గంటలకే మాజీ మంత్రి వినోద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మరోవర్గం నాయకులు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల నాయకుల మధ్య పెనుగులాట జరిగింది.