Congress | హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కష్టపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ వెంటనే కొట్లాటల్లో మునిగిపోయింది. అది చూసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేమేమైనా తక్కువ తిన్నామా? అంటూ ఎన్నికలకు ముందే తన్నుకుంటున్నారు. పార్టీ నేతల్లో రోజుకు రోజుకు పెరుగుతున్న అసంతృప్తికి ఇవి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు రోజుకో చోట బహిరంగంగానే బజారుకెక్కుతున్నారు. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కాంగ్రెస్లో కయ్యాలే కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం చూస్తున్న ప్రజలు కాంగ్రెస్ను ఈసడించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలకు మారుపేరని, ఇక దానిని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. రాజకీయ విలువలను ఆ పార్టీ పూర్తిగా నాశనం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి విలువను తగ్గించుకోవద్దని సూచిస్తున్నారు. పొరపాటున ఓటు వేస్తే.. రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తరి మాదిరిగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టానికి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరంగా ఉంటే.. రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలోనూ ఇదే తీరు
రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆ పార్టీ నేతలు కుమ్ములాటల్లో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో చోట ఇది నిత్యకృత్యంగా మారింది.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రతి రోజు ఇలాంటివి ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉం టాయి. నేతలంతా ఎవరికి వారే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్ఠానం మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంటున్నది. నేతలపై అధినేతలకే అజమాయిషీ లేకపోతే వారిని కంట్రోల్ చేసేవారెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పార్టీ నమ్మి ఓటేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
కర్ణాటకలో కయ్యాలు
అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి క ర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ ఆ వెంటనే తన నిజస్వరూపాన్ని బ యటపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ఆ పా ర్టీ ఇప్పుడు అవినీతికి తెరలేపింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ సీఎం శివకుమార్ పేరు కూడా ఇందులో ఉండటం గమనార్హం. కర్ణాటక కాంగ్రెస్లో ఎప్పటి నుంచో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. ఎన్నికల ముందు మా త్రం పార్టీలో అంతా సవ్యంగానే ఉన్నదని నమ్మించే ప్రయ త్నం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం మళ్లీ తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. ఇద్ద రూ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపా రు. కర్ణాటకలోనే కాదు, దేశంలోని ప్రతిచోటా కాంగ్రెస్ పరిస్థితి ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాలని, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.