MLC Elections | నల్లగొండ : వరంగల్ – నల్లగొండ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో నార్కట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు పట్టభద్రులకు డబ్బులు పంచుతున్నట్లు స్వతంత్ర అభ్యర్థి పాలకురి అశోక్ గౌడ్కు అందింది. దీంతో ఆయన అక్కడ వెళ్లి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఆగ్రహావేశాలతో అశోక్ గౌడ్పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఒక ఫోన్ను లాక్కున్నారు. మరో ఫోన్ను పగులగొట్టారు. కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ నార్కట్పల్లి పీఎస్ ముందు అశోక్ గౌడ్ బైఠాయించారు. డబ్బులు పంచుతున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అశోక్ గౌడ్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్ధి చింతపండు నవీన్ వర్గీయులు డబ్బులు పంచుతుండగా అడిగినందుకు తమ మీద దాడి చేశారని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ https://t.co/FCurDOs0xZ pic.twitter.com/8nIbxxp3f4
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2024