దేవరుప్పుల, అక్టోబర్ 29: పాలకుర్తి నియోజకవర్గంలో బాహుబలి లాంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు రంగంలో ఉన్నారని, ఆయనను ఢీకొనాలంటే చెమటోడ్చాలని పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో ఆదివారం ఝాన్సీరెడ్డి పోకడలపై కాంగ్రెస్ అసమ్మతి నాయకుల సమావేశం జరిగింది. దీనికి నేతృత్వం వహించిన ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఝాన్సీరెడ్డి ఒంటెద్దు పోకడల వల్ల పార్టీకి ఇప్పటికే తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. బాహుబలి లాంటి, ఓటమి ఎరుగని నాయకుడు ఎర్రబెల్లిని ఢీకొట్టడం కనీస రాజకీయ అనుభవం లేని ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి వల్ల అవుతుందా? అని అన్నారు. ఝాన్సీరెడ్డి తీరుతో సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలిపారు. ఆమె కలుపుకుపోతే సరి, లేకపోతే తమ దారి తమదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీరారెడ్డి దామోదర్రెడ్డి, పాలకుర్తి మాజీ ఎంపీపీ యాకస్వామి, అల్లం ప్రదీప్రెడ్డి, రవీందర్నాయక్, ప్యాక్స్ మాజీ చైర్మన్ భాస్కర్, రవి, నర్సింగరావు, జాటోత్ రాహుల్నాయక్, మహేందర్రెడ్డి, సలాం, రాహుల్రెడ్డి, కాసాని ఎర్రయ్య తదితరులు ఉన్నారు.