BRS | హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. విపక్షాలు ఎంత యాగి చేసినా మూడోసారి సీఎం కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జ్ కల్వకుంట వంశీధర్రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సభ్యులు, ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు చామల ఉదయ్ చందర్ రెడ్డి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన ఉదయ్చందర్రెడ్డికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆలేరులో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు. మూడోసారి గొంగిడి సునీత గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు మద్దతు పలుకుతారని అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలను, చేస్తున్న అభివృద్ధిని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చలు పెట్టాలని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని, కేసీఆర్ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన చామల ఉదయ్ చందర్ రెడ్డికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పార్టీలో చేరిన వారిలో దాతారుపల్లికి చెందిన తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్వేష్, మోటకొండూర్కు చెందిన చామల భానుచందర్ రెడ్డి, దాతారుపల్లికి చెందిన ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ భానుచందర్, గౌరాయపల్లికి చెందిన వడ్లకొండ శ్రీకాంత్, చాడకు చెందిన కూరేళ్ల నరేశ్ గౌడ్, నాంచారిపేటకు చెందిన గంధమల్ల కరుణాకర్, ఆత్మకూరు (ఎం)కు చెందిన తిరునగరి ఫణిందర్, కొండాపూర్కు చెందిన కొప్పుల నర్సిరెడ్డి, రుస్తాపూర్కు చెందిన కొండపురం శ్రీహరి, శ్రీకాంత్, తేరాలకు చెందిన చామల మేఘారెడ్డి, రాఘావపురానికి చెందిన భగవంత్రెడ్డిలు తదితరులున్నారు.