హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పెద్దపెద్దగా కట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి చెప్పారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ‘కలెక్టర్, ఎస్పీ ఆఫీసులు పెద్దపెద్దగా కట్టడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
కార్యాలయాలు చిన్నచిన్నగా ఉన్నంత మాత్రాన అధికారులు పనిచేయకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదు. కొత్త సచివాలయాన్ని పెద్దగా కట్టడంతో ప్రజలకు ఉపయోగం లేదు. కొత్తది కట్టడం వల్ల ప్రజాధనం వృథా అయ్యింది. ఇది హిట్లర్ విధానం’ అని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండేదని, ప్రజలు మాత్రం అత్యంత పేదలుగా ఉండేవారని చెప్పారు.