మంచిర్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గురువారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో అంకం నరేష్ 20 వార్డు కౌన్సిలర్, నాంపల్లి మాధవి శ్రీనివాస్ 26 వార్డ్ కౌన్సిలర్, శ్రీ రాముల సుజాత మల్లేష్15వ వార్డ్ కౌన్సిలర్, బాణావత్ ప్రకాష్ నాయక్7 వార్డ్ కౌన్సిలర్ ఉన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొన్నారు.