హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతోపాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ముహూర్తం ఖరారు చేసినప్పటికీ కాస్త ఆలస్యంగా 1.21 గంటలకు రేవంత్రెడ్డి ప్రమాణం చేశారు.
ఆయన తర్వాత వరుసగా డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టం చేయడంపై తొలి సంతకం చేశారు.
ఆ తర్వాత గతంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగురాలైన రజినికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు. ప్రమాణ స్వీకారంలో మూడు భిన్న ఘటనలు జరిగాయి. అందరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా ఒక్క దామోదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క మనస్సాక్షిగా అంటూ ప్రమాణం చేయగా, మిగిలిన అందరూ దేవుని సాక్షిగా ప్రమాణం స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్రెడ్డిని, మంత్రులను కాంగ్రెస్ అగ్రనేతలు అభినందించారు.
హాజరైన ప్రముఖులు
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ అభిమానులు తరలివచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి సోనియాగాంధీకి పాదాభివందనం చేశారు. అనంతరం తన కూతురు, అల్లుడిని సోనియా, రాహుల్కు పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులను రేవంత్రెడ్డి హత్తుకొని అభినందించారు.
సచివాలయానికి రేవంత్
సీఎంగా ప్రమాణం స్వీకరించిన అనంతరం రేవంత్రెడ్డి సచివాలయానికి వెళ్లారు. సతీమణి గీతతో కలిసి సచివాలయానికి వెళ్లిన ఆయనకు సీఎస్ శాంతికుమారితోపాటు అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా 6వ అంతస్థులోని సీఎం చాంబర్లోకి వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
క్యాబినెట్ తొలి భేటీ
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజునే క్యాబినెట్ తొలి భేటీ జరిగింది. సచివాలయంలో సా యంత్రం 5.25 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సీఎం శాంతికుమారి కొత్త సీఎంతోపాటు మంత్రులకు స్వా గతం పలికారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దు ద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొ న్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తు మ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఆయా శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్రెడ్డి
ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకా రం అనంతరం ప్రజలనుద్దేశించి రేవంత్రెడ్డి ప్రసగించారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా, గౌరవంగా ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తానని తెలిపారు. రాష్ర్టాన్ని సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిది ద్దే బాధ్యత తనదని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొంటానని అన్నారు.
‘ప్రజాస్వామ్యా న్ని పునరుద్ధరించి నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సోనియాగాం ధీ ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది’ అని పేర్కొన్నారు. రైతాంగం, విద్యార్థులు, నిరుద్యోగ యువత, అమరవీరుల కుటుంబాల ఆ కాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతినపూనిందని తెలిపారు.
తమ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమాన అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలు తమ ఆలోచనను, ఆకాంక్షలను ఎప్పుడైనా పంచుకోవచ్చని చెప్పారు. ఖర్గే, సోనియా, రాహుల్ సూచనలతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. తాము పాలకులం కాదని, సేవకులమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత తనదని ప్రకటించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావ్పూలే ప్రజా భవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మరో ఆరుగురు ఎవరో?
క్యాబినెట్లో సీఎంతోపాటు మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. గురువారం సీఎం రేవంత్రెడ్డితో సహా 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంకా 6 మంత్రి స్థానాలు మిగిలి ఉన్నాయి. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఎప్పుడు ప్రకటిస్తారనే అంశంతో పా టు మిగిలిన ఆరుగురు ఎవరనేదానిపై కాంగ్రెస్లో చర్చ మొదలైంది. ఎవరెవరికి ఈ స్థానాలను కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పోటీలో ఇంకా చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, జీవన్రెడ్డి, మధుయాష్కీతోపాటు విజయం సాధించిన సుదర్శన్రెడ్డి, వివేక్, వినోద్, ఆది శ్రీనివాస్, ప్రేమ్సాగర్రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పోటీలో ఉన్నట్టు సమాచారం.
ఉప ముఖ్యమంత్రిగా భట్టి
మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం లో జన్మించారు. పీజీ వరకు చదివారు. 2009, 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011-2014 వరకు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్గా, 2011-2014 వరకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2019-2023 వరకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. 2023లో ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం పదవి దక్కించుకొన్నారు.
ఐదోసారి మంత్రిగా తుమ్మల
ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గండుగులపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు జన్మించారు. బీకాం చదివారు. ఆయన 1985, 1994, 1999, 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్అండ్బీ, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఎక్సైజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2023లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి దక్కించుకొన్నారు.
మొదటిసారి మంత్రిగా పొంగులేటి
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం నారాయణపురంలో జన్మించారు. బీఏ ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 2013లో వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023లో ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ క్యాబి నెట్లో మం త్రి పదవి దక్కించుకొన్నారు.
సంగారెడ్డి జిల్లా నుంచి దామోదర
సిలారపు దామోదర రాజనర్సింహ హై దరాబాద్లో జన్మించారు. బీఈ సివిల్ పూ ర్తిచేశారు. 1999, 2004, 2009, 2023 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ప్రాథమిక విద్య, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇప్పడు మంత్రి అయ్యారు.
రెండోసారి మంత్రిగా ఉత్తమ్
ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి మండలం తాటిపాములలో జన్మించారు. 1999, 2004లో రెండుసార్లు కోదాడ.. 2009, 2014, 2018, 2023లో నాలుగుసార్లు హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో 610 జీవో అమలు చైర్మన్గా, గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకొన్నారు.
యువజన నేత నుంచి రెండోసారి అమాత్యుడిగా కోమటిరెడ్డి
నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర మంత్రి పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల బ్రాహ్మణవెల్లంలలో జన్మించారు. తొలిసారి 1999లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 వరకు వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 2019లో భువనగిరి ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఎన్నికల్లో విజయం సాధించడంతో సీఎం రేవంత్రెడ్డి సర్కారులో మంత్రిగా ప్రమాణం చేశారు.
కరీంనగర్ నుంచి మంత్రిగా దుద్దిళ్ల
దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో జన్మించారు. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. తండ్రి శ్రీపాదరావును మావోయిస్టులు హత్య చేయడంతో ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చారు. 29 ఏండ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018, 2023 వరుసగా ఎమ్మెల్యేగా విజ యం సాధించారు. పౌరసరఫరాలు, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అ నుభవం ఉన్నది. ప్రస్తుతం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్నారు.
మొదటిసారి మంత్రిగా పొన్నం
పొన్నం ప్రభాకర్గౌడ్ కరీంనగర్లో జన్మించారు. ఎంఏ ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 2009లో కరీంనగర్ ఎంపీగా గెలి చారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్ర లోక్సభ, రాజ్యసభ ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా, రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, రసాయనాలు, ఎరువుల స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. తాజాగా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
రెండోసారి మంత్రిగా సురేఖ
కొండా సురేఖ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలో జన్మించా రు. బీకాం పూర్తి చేశారు. 1995లో గీసుగొండ మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ క్యాబినెట్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు వరంగల్ తూర్పు నుంచి ఎన్నికై మంత్రి పదవి పొందారు.
మావోయిస్టు నుంచి మంత్రిగా సీతక్క
ధనసరి అనసూయ (సీతక్క) ములు గు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట లో జన్మించారు. ఎల్ఎల్బీ, పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ సాధించారు. 1988లో 10వ తరగతి చదువుతూ జనశక్తి పార్టీలో మావోయిస్టుగా చేరారు. 1997లో జనజీవన స్రవంతిలో కి వచ్చారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో కాంగ్రెస్లో చేరారు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పడు మళ్లి గెలిచి మంత్రి పదవి దక్కించుకొన్నారు.
ఐదోసారి మంత్రిగా జూపల్లి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీనియర్ నేతగా పేరున్న జూపల్లి కృష్ణారావు ఆరుసా ర్లు ఎమ్మెల్యేగా, వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వైఎస్, కిరణ్కుమార్రెడ్డి, రోశ య్య క్యాబినెట్తోపాటు, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రె స్ తరఫున గెలిచి మంత్రి అయ్యారు.
రేవంత్ మంత్రివర్గం