వెంగళరావునగర్, మే 18 : చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని దవాఖానాకు వెళ్లినప్పటికీ.. అతికించలేమని వైద్యులు చెప్పేసరికి హతాశురాలైంది ఆ మహిళ. హైదరాబాద్ మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జవహర్నగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.
మధురానగర్ పోలీసుల కథనం ప్రకా రం.. జవహర్నగర్కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్హౌజ్లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉంటుంది. మమత వద్ద ఇంటి యజమానురాలు సుజిత చిట్టీలు వేసేది. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది. ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు ఇప్పించింది. వారం రోజుల తర్వాత సుప్రియ ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది.
చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి మమత, ఆమె భర్త హేమంత్ వచ్చారు. ఇంటి అద్దె చెల్లించకుండా సుప్రియ వెళ్లిందని.. అద్దె డబ్బు ఇవ్వాలని సుజిత పట్టుబట్టింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు. ఊడిన వేలిని పట్టుకుని దవాఖానాకు పరుగులు తీయగా, ఆ వేలిని అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ను రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.