టెల్అవీవ్, ఏప్రిల్ 16: ఇజ్రాయెల్ పౌరులు మరోసారి ఆందోళనలను ఉధృతం చేశారు. న్యాయ సం స్కరణలకు వ్యతిరేకంగా వేలాదిగా జనాలు జెండాలు చేతబట్టుకొని, ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకుందామం టూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్ర భుత్వానికి అధికారాలు కల్పించాలని బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం నిర్ణయించడంపై ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 15 వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు ఉధృతం కావడంలో మార్చి 27న సంస్కరణలను నిలిపివేసి చర్చలు జరుపుతామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరసనకారులు కొంత శాంతించారు. తాజాగా అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ మూడీస్.. ఇజ్రాయిల్ ధృక్పథాన్ని ‘సానుకూలం’ నుంచి ‘స్థిరం’గా తగ్గించడం మళ్లీ నిరసనలకు కారణమైంది.