కోనరావుపేట, మే 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని 8వ వార్డులో తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తే ఒక్క రోజు మాత్రమే వాటర్ ట్యాంకర్ ద్వారా నీరందించినట్టు పేర్కొన్నారు.