సిద్దిపేట, మార్చి 20: కరెంట్ సరఫరా లేక రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్య పరిష్కరించాలంటూ బుధవారం రాత్రి సిద్దిపేట పట్టణవాసులు పలువురు ఆందోళనకు దిగారు. ఈదురుగాలులు, వడగండ్ల వలకకల ఎల్లమ్మ టెంపుల్, 16వ వార్డులో విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి కరెంటు సమస్య తలెత్తిందని తెలిపారు.
పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, తాగునీరు రావడంలేదని, వెంటనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యుత్తు ఎస్ఈ మోహన్రెడ్డిని అడుగగా.. కరెంట్ స్తంభాలు పునరుద్ధరించామని, కోన్ని చోట్ల చెట్ల కొమ్మలు, ఇతర సమస్యల వల్ల సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని సరిచేస్తున్నామని తెలిపారు.