హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : మార్కెట్ డిమాండ్, ఇండస్ట్రీ అవసరాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్తకోర్సులను రూపొందించి అమలు చేస్తున్నది. అందులోభాగంగా, తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు పచ్చజెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ను ఆనర్స్ డిగ్రీ కోర్సుగా అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో కొత్త కోర్సులపై చర్చించారు.
12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు. కాలేజీలు ముందుకొస్తే అన్నింటిలో ఈ కోర్సును అనుమతించాలని వీసీలు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది నుంచి దోస్త్ ద్వారా ఈ కోర్సు సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటికే బీఏ ఆనర్స్ హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టగా, ఇవి విజయవంతంగా అమలవుతున్నాయి. సమావేశంలో కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, పలు వర్సిటీల వీసీలు కట్టా నర్సింహారెడ్డి, దండెబోయిన రవీందర్యాదవ్, గోపాల్రెడ్డి, ఎస్ మల్లేశ్ పాల్గొన్నారు.
కోర్సు విశేషాలు ఇవీ..
మన ఉద్యోగాలు.. మన విద్యార్థులకు దక్కేలా..
రాష్ర్టానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో అనేక సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకొన్నాయి.ఐటీ కంపెనీలన్నీ కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివిన వారినే రిక్రూట్ చేసుకొంటాయి. మన రాష్ట్ర కంపెనీల్లోని ఉద్యోగాలను మన విద్యార్థులు దక్కించుకొనేలా ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగానే బీఎస్సీ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్