హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో వారం రోజుల పాటు నిర్వహించిన సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం (సీబీపీ) శనివారం ముగిసింది. భారత ప్రభుత్వ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు, అధికారులకు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయ్యింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అధికారులను సృజనాత్మక, నిర్మాణాత్మక, ఊహాత్మక, వినూత్న, క్రియాశీల, వృత్తిపరమైన, ప్రగతిశీల, శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ తదితరులు అభినందించారు.