హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం సహా అన్ని క్యాడర్ల ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఈఎస్ఏ) అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి , ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నె ప్రభాకర్ సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ని కలిసి తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు అన్ని క్యాడర్ల వారికి ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ అసోసియేషన్ ప్రతినిధులతో వెంటనే చర్చించి ప్రమోషన్ల ప్రక్రియకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని సీఎస్ను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఈఎస్ఏ ఉపాధ్యక్షుడు పాక రమేశ్, కార్యదర్శులు నజీమ్ఖాన్, సైదులు, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల అధ్యక్షులు రామకృష్ణ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి పదోన్నతులపై అప్పటికప్పుడే సీఎం కేసీఆర్కు ఆదేశాలు జారీ చేయడం పట్ల ట్రెసా నేతలు హర్షం వ్యక్తం చేశారు.