మర్రిగూడ, జూన్ 11: శివన్నగూడెం రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో రిజర్వాయర్ నిర్మిస్తుండగా పట్టా భూములతోపాటు అసైన్డ్భూములకూ పరిహారం అందిస్తున్నది. 3565.35 ఎకరాల భూమి ముంపునకు గురవుతుండగా, అందులో 468 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. ఇప్పటికే అసైన్డ్ భూమి ఉన్న రైతులకు పరిహారం చెల్లించింది. తాజాగా, శుక్రవారం డిప్యూటీ తాసీల్దార్ తారకారామన్ 16.12 ఎకరాలకు రూ.64,56,526 విలువైన చెక్కులను 26 మందికి అందించారు.