పెద్దపల్లి : సింగరేణిలో కారుణ్య నియామకాల జాతర కొనసాగుతున్నది. మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతున్నది. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని వివిధ కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల డిపెండెంట్లు 18 మందికి శనివారం రామగిరిలోని జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీఎం మనోహర్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఏఎల్పీ గనిలో పోస్టింగ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితిలో సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అంటే మాటలు కాదనీ, ఒక వరంలా భావించాలన్నారు. ఉన్నత అభ్యాసం చేసినవారే సాధారణ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న సమయంలో సింగరేణి యాజమాన్యం పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, ఎస్వోటూ జీఎం రఘుపతి, డీజీఎం విలాస్ శ్రీనివాస్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది