హనుమకొండ : అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం లక్ష్మీ నగర్, శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్ర భాగాన దూసుకెళ్తుందన్నారు.
గత ఆరవై ఏళ్లుగా జరగని అభివృద్ధి కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆరేండ్లలో సాకారం అయ్యిందన్నారు. రాష్ట్రంలో మిగతా నియెజకవర్గాలకు వరంగల్ పశ్చిమ నియెజకవర్గానికి చాలా తేడా ఉందన్నారు.
ఇక్కడ కూలీ పని చేసుకునే వాళ్ల దగ్గర నుంచి విద్యవంతులు, మేధావులు, ఉద్యోగులు నివసిస్తున్నారని తెలిపారు. కాలనీ పెద్దల సమాక్షంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ అభివృద్ధిలో అధికారులు పాత్ర అభినందనీయమన్నారు.
ఎల్లప్పుడూ ప్రజలో మధ్యలో ఉంటూ వారికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన నియెజకర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయలని కాంట్రాక్టర్లకు సూచించారు.