BJP | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
నిజాం వ్యతిరేక పోరాటంలో, స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, జనసంఘ్ పాత్రేమిటో చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాను ప్రశ్నించారు. దేశ చరిత్రనే పునర్లిఖించేందుకు కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.