హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ బ్యాంకు విధానాలకు, విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా 2002లో కాంగ్రెస్, వామపక్షాలు, రైతాంగం, కార్మికులు, ప్రజలు సాగించిన చారిత్రక ఉద్యమం జరిగి 26 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 28న విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు తెలిపాయి. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బషీర్బాగ్లోని విద్యుత్తు అమరవీరుల స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. అనంతరం 11 గంటలకు బషీర్బాగ్ విద్యుత్తు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నట్టు వామపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు జాన్వెస్లీ, కూనంనేని సాంబశివరావు, పోటు రంగారెడ్డి, సూర్యం, రవి, రమేశ్బాబు, మురారి, జానకీరాములు, ప్రసాద్ తెలిపారు.