యాదాద్రి : యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆలయ ఈఓ ఎన్ గీత, భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. రూ.కోటి వెచ్చించి కొండపైన, రింగ్రోడ్డు చుట్టూ, ప్రెసిడెన్సియల్ సూట్, యాదాద్రి- రాయగిరి ప్రధాన రోడ్డుకు బిగించిన సీసీ కెమెరాలను కొండపైన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసినట్లు తెలిపారు.