చిగురుమామిడి, మే 25: తల్లి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పరిధిలోని రాజన్నపల్లికి చెందిన వంగ రాహుల్ స్థానిక డార్విన్ సూల్లో పదో తరగతి చదువుతున్నాడు.
బుధవారం విద్యార్థి తల్లి శ్రీలత ఆత్మహత్య చేసుకొన్నది. తల్లి మృతదేహం ఇంటివద్ద ఉండగానే రాహుల్ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ బుధవారం ఆంగ్ల పరీక్షకు హాజరయ్యాడు. రాహుల్ పరిస్థితి చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.