విద్యానగర్, జనవరి 7: కామారెడ్డి మాస్టర్ప్లాన్పై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్ప ష్టంచేశారు. భూములు పోతాయని కొందరు పదేపదే చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. భూ ములు పోతాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని సూచించారు. ప్రస్తుతం జారీ చేసింది బృహత్ ప్రణాళిక ముసాయిదా మాత్రమేనని తెలిపారు. శనివారం కలెక్టర్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. మాస్టర్ప్లాన్ ప్రస్తుతం డ్రాఫ్ట్ దశలోనే ఉన్నదని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు 1,026 అభ్యంతరాలు వచ్చాయని, ఈనెల 11వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉన్నదని అన్నారు. గతంలో నిర్ణయించిన మాస్టర్ప్లాన్తో రైతుల భూములు పోలేదని, ఇప్పుడు కూడా పోవని, రైతులు అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. రైతుల అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్టు తెలిపారు.