కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఓ నాగుపాము శివలింగంపైకి చేరుకొని పడగ విప్పి నాట్యం చేసింది. అప్పటివరకు గుడిలో ఉన్న భక్తులు శివలింగాన్ని చుట్టుకుని ఉన్న నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యారు.
తర్వాత తేరుకుని పాముకు మొకుకుని, పూజలు చేశారు. నాగుపాము శివలింగంపైకి చేరుకుని పడగ విప్పడంపై శివ మహిమ అంటూ భక్తులు చర్చించుకున్నారు.
-హుజూరాబాద్ టౌన్