Road accident: మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్తోపాటు బస్సులోని పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తుండగా కాటారం-భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.