హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ విషయాన్ని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించని అభ్యర్థులు ఈ నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ఉచిత కోచింగ్కు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 040-24071178, 27077929 నంబర్ల ద్వారా తమను సంప్రదించాలని సూచించారు.