హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గోదావరిఖనిలోనే కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయాన్ని కొనసాగించాలని సీఎంపీఎఫ్ బోర్డు నిర్ణయించింది. మహారాష్ట్రలోని నాగపూర్లో కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి అనిల్కుమార్జైన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ కార్యాలయాన్ని హైదరాబాద్కు తరలించాలన్న ప్రతిపాదనను బోర్డు ట్రస్టీలు తిరస్కరించారు.
ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ బొగ్గు శాఖకు ఇప్పటికే సింగరేణి సీఎండీ శ్రీధర్ లేఖ రాయగా, తాజా సమావేశంలో సింగరేణి డైరెక్టర్ బలరామ్ వాదనలు వినిపించారు. కేంద్ర కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి. గోదావరిఖనిలోని కార్యాలయానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నదని, సహకరించాలని బోర్డు అధికారులు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని బలరామ్ హామీ ఇచ్చారు.