యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న తుది మెరుగుల పనులను సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. మొదటగా బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న తుది మెరుగులను పరిశీలించారు. క్యూ లైన్లు, మాడ వీధులు, లిప్టు, రథశాల పనులను పరిశీలించి, ప్రధానాలయం తూర్పు రాజగోపురానికి గల దర్వాజలకు ఇత్తడి తొడుగుల పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.
గర్భాలయంలోని లైటింగ్ పనులు పరిశీలించి భూపాల్ రెడ్డి పలు సూచనలు చేశారు. శివాలయం, మెట్ల నిర్మాణ పనులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కొండ కింద గండి చెరువు వద్దగల పుష్కరిణి, కల్యాణ కట్ట, ప్రెసిడెన్షియల్ సూట్ల పనులను పరిశీలించి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఎన్సీ రవీందర్ రావు, ఎస్ఈ వసంత నాయక్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, రామారావు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కంగనా పరువాల విందు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
సిద్ధాపూర్లో గంజాయి మొక్కలు ధ్వంసం
థియేటర్స్లోకి రాబోతున్న మరో రెండు సినిమాలు