భీమ్గల్, జూన్ 13: తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్దేశం కోరుకొంటున్నదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్కు చెందిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట గంగాధర్, బూరెడి శ్రీనివాస్, నంగి జలంధర్, ఈదప నరేశ్ తదితరులు హైదరాబాద్లో మంత్రి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కావాలని ఆయా రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.