హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాలు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఎఫ్ఎల్వో హైదరాబాద్ విభాగం 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మహిళా పారిశ్రామికవేత్తలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఇండస్ట్రీయల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరొక ఇండస్ట్రీయల్ పార్క్ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.