హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మేడారం మహా జాతర పోస్టర్ను సీఎం రేవంత్రెడ్డి శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం సీఎం నివాసంలో ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్, సినీ నిర్మాత సురేశ్బాబులు సీఎంను కలిసి అభినందనలు తెలిపారు.
మధ్యాహ్నం సచివాలయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ ఎం కోదండరాం, అమీర్అలీఖాన్ సీఎం రేవంత్రెడ్డిను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమను ఎమ్మెల్సీలుగా నియమించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ మాసపత్రికను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి, సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి, మాపత్రిక ఎడిటర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.