హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలు కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం 8వేల ఇందిర స్త్రీ శక్తి భవనాల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డీమార్ట్, బిగ్బజార్లకు పోటీగా అద్భుతమైన మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెలాగా ఇందిరమ్మ చీరలు అందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఇందిరమ్మ చీరల డిజైన్లను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరిల్యాండ్లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఏటీఏ) తెలుగు మహాసభలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతినిధులు కోరారు. సీఎంను కలిసిన వారిలో ఏటీఏ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు.