Revanth Reddy | హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థులపై దాడులపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సయీద్ మజ్హర్ అలీపై నలుగురు దుండగులు దాడి చేయడం తీవ్ర కలతకు గురి చేసిందన్నారు. ఇటీవలే ఓహియోలో బీ శ్రేయాష్ రెడ్డిపై కూడా దాడి చేయడంతో అతను మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా తెలుగు విద్యార్థులపై దాడులు జరగడం ఆందోళనను కలిగిస్తుందన్నారు.
తెలుగు విద్యార్థుల భద్రతపై తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Very disconcerted to learn of the attack on Syed Mazhar Ali, a student from #Hyderabad, by four robbers in #Chicago. This follows a fatal attack on B. Shreyas Reddy, who was killed in Ohio.
I request Hon’ble External Affairs Minister @DrSJaishankar ji to kindly convey our…
— Telangana CMO (@TelanganaCMO) February 7, 2024