హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్య క్తి గద్దర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. గద్దర్ వర్ధంతిని పురసరించుకొని సీఎం మంగళవా రం ఆయన సేవలను స్మరించుకున్నా రు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉ న్నత కొలువులవైపు దృష్టిసారించకుం డా ప్రతి ఒకరికీ కూడు, గూడు, నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్య ప ర్చారని పేరొన్నారు. తెలంగాణ జనసమితి, తెలంగాణ జనసభతోపాటు పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ అని గుర్తుచేశారు. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని, ఆయన చేసిన సాంసృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చిందని తెలిపారు.