CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ): కులవృత్తులపై సీఎం రేవంత్రెడ్డి మరోమారు చులకనభావం ప్రదర్శించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసుకోవాలె. గొర్రెలు పెంచుకునే వారు గొర్రెలు కాసుకోవాలె. చేపలు పట్టుకునే వాళ్లు చేపలు పట్టుకోవాలె, చెప్పులు కుట్టేవాళ్లు చెప్పులు కుట్టాలి” అన్నట్టుగా గత ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చిందని, తాము మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి తోచిన పని, ఎవరికి వచ్చిన, నచ్చిన పని చేసుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కులవృత్తులను అవమానించిన సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.