హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ము గించుకొని సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 15న దావోస్కు వెళ్లిన రేవంత్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3 రోజులపాటు పాల్గొని అక్కడి నుం చి లండన్ వెళ్లారు. అక్కడ రెండురోజలపాటు గడిపిన సీఎం.. థేమ్స్ నది అభివృద్ధికి తీసుకున్న చర్యలపై రాష్ట్ర అధికారులతో కలిసి అధ్యయనం చేశారు. కాంగ్రెస్ అనుకూల ప్రవాస తెలంగాణ వాసులు ఏర్పాటుచేసిన ‘హలో లండన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లిన సీఎం సోమవారం తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేతో భేటీ
హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి సోమవారం హైదరాబాద్కు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే, సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. రేవంత్రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కాంగ్రెస్ సంస్థాగత అంశాలపై చర్చ జరిగినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. సీఎం రేవంత్రెడ్డి, డీకీ శివకుమార్ ఇద్దరూ కలిసి సాయంత్రం హబ్సిగూడలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ‘కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్’ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ డీకే ఒక్కరే హాజరయ్యారు. విదేశీ పర్యటన బడలిక కారణంగా రేవంత్రెడ్డి రాలేకపోయారని డీకే తెలిపారు.