Lasya Nanditha | హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నందిత కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో పాటు పలువురు నివాళులర్పించారు.
మరికాసేపట్లో లాస్య నందిత అంతిమయాత్ర ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ నాయకులు భారీగా చేరుకున్నారు. మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లాస్య నందిత పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.