హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అక్కడి థేమ్స్ నదిని సందర్శించారు. మూసీ నది పునరుజ్జీవం, నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఆయన థేమ్స్ నదిని, దాని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరును, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సీఎంకు వివరించారు. హైదరాబాద్లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తు న్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీ కలసి లండన్ షార్డ్ను సందర్శించారు. అకడి నుంచి లండన్ అర్బన్ లేఔట్ను, అక్కడి అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, పురపాలకశాఖ కార్యదర్శి దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలీ, ఎస్ఈ వెం కటరమణ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెష ల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రపంచ సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిషారం
ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచడం ద్వారా ప్రపం చం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. భారత్, బ్రిటన్ మధ్య బలమైన ప్రజాస్వామ్య బంధం ఉన్నదని చెప్పారు. లండన్లో పర్యటిస్తున్న రేవంత్రెడ్డి చారిత్రక వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ.. నేడు ప్రపంచం హింస, ఉగ్రవాదం, ప్రజా హకుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి వంటి అనేక సవాళ్లను ఎదురొంటున్నదని, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయటం ద్వారానే వీటికి విరుగుడు సాధ్యమవుతుందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ ఎంచుకున్న సత్యం, అహిం స, న్యాయ పోరాటమే భారత్కైనా, బ్రిటన్కై నా ఇప్పటికీ మార్గదర్శకం సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్రశర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దావోస్లో రూ.40,232 కోట్ల పెట్టబడులు
సీఎం రేవంత్రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నది. ఈ సందర్భంగా తెలంగాణ బృందం సుమారు 200 సంస్థలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపింది.