ముధోల్(నిర్మల్) : దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్(CM KCR) ధ్యేయమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) వెల్లడించారు . నిర్మల్ జిల్లా(Nirmal District) లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు(Paddy Purchase) జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతుబంధు(Raitu Bandu), రైతు బీమా, పంటలకు గిట్టుబాటు ధర, నిరంతర కరెంట్ సరఫరా, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.
రైతులకు కోసం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ. 1.30 కోట్ల వ్యయంతో రాజురా గ్రామంలో నిర్మించిన 33/KV విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. గతంలో లో వోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోయేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ సరాఫరా చేయగలుగుతున్నామని తెలిపారు. మిషన్ భగీరథ(Mission Bagiratha) పథకం శుద్ధి చేసిన నల్లా నీటిని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మిరెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.