కరీంనగర్ : రజకులపట్ల గత ప్రభుత్వాలు వివక్ష చూపించాయి. రజకుల బాగోగులు పట్టించుకోలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ 4వ డివిజన్ లో రూ. 2 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక దోభీఘాట్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
గతంలో బట్టలు ఉతకాలంటే ఇబ్బందులు పడాల్సిన రోజులు. స్వయం పాలనలో రజకుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రజక వృత్తిలో ఆధునికీకరణ జరగాలని..అత్యాధునిక దోభీఘాట్లను సీఎం నిర్మిస్తున్నారని తెలిపారు. దొరల అరాచకానికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను గత పాలకులు పట్టించుకోలేదు.
కానీ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మను గుర్తించి..జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
అభివృద్ధి చెందిన తెలంగాణాలో పాత పాలకులు అధికారంలోకి వస్తే మళ్లీ గుడ్డిదీపం పెట్టుకోవాల్సిన రోజులొస్తాయి. టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు.
రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉందామన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.