హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం (మే 21) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతి మానవజాతి ప్రగతికి ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు, కట్టుబొట్టు, ఆహార వ్యవహారాలతో కూడిన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని సీఎం పేరొన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలవడంలో ఇకడి సాంస్కృతిక జీవన విధానం, దండలో దారమై కొనసాగుతున్నదన్నారు.
గంగా జమున తెహజీబ్కు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నదని, భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ ఘనతను ఎప్పటికప్పుడు ఎత్తి పడుతున్నదని పేర్కొన్నారు. సబ్బండ వర్ణాల భాష, సంప్రదాయ సాంస్కృతిక, అస్తిత్వ జీవన తాత్వికకు తెలంగాణ ప్రభుత్వం పబ్బతి పడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.