హైదరాబాద్ : ఈ నెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేడారం జాతరకు వెళ్లనున్నారు. వన దేవతలైన సమ్మక్క – సారలమ్మకు కేసీఆర్ బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. మేడారం జాతర నేటి నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతరకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక సీఎం కేసీఆర్ 20వ తేదీన ముంబయికి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 21న నారాయణఖేడ్లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.