హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్బాడీ కలెక్టర్లు, డీపీవోలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.